Friday, November 23, 2007

వికలాంగులకు రుణాలపై రాయితీ పెంపు

వికలాంగ విద్యార్థులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులతో సమానంగా ఉపకారవేతనాలు, ఫీజులు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 23వ తేదీన మహిళా, శిశు సంక్షేమం, వికలాంగుల సంక్షేమం, ఏపీ డైరీలపై ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి సమీక్ష జరిపిన అనంతరం మంత్రి రాజ్యలక్ష్మి వికలాంగులు పొందే రుణాలపై రాయితీని రూ.3వేల నుంచి రూ.10వేలకు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పోరేషన్‌ల ద్వారా ఇచ్చే రుణాలపై రూ.10వేల వరకూ రాయితీ ఇస్తుండగా... వికలాంగుల కార్పోరేషన్ అందించే రుణాలపై రూ.3వేలు మాత్రమే రాయితీ కల్పిస్తున్నారు.

Labels: ,

Wednesday, November 21, 2007

యువకళాకారులకు ఉపకార వేతనాలు

యువ కళాకారులు 2008-09 సంవత్సరానికి ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సాంస్కృతిక వ్యవహారాలశాఖ అధికారులు ఒక ప్రకటనలో కోరారు. 10-14 సం|| మధ్య వయస్సు ఉండి శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, నృత్యం, నృత్యరూపకం, నాటకం, జానపద కళల్లో అభిరుచి ఉన్నవారు కేంద్ర ప్రభుత్వ ఉపకార వేతనాలు పొందవచ్చు. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 20వ తేదీలోగా దరఖాస్తులను సంచాలకులు, సాంస్కృతిక శాఖ, కళాభవన్, రవీంద్రభారతి, సైఫాబాద్, హైదరాబాద్ అనే చిరునామాకు పంపించాలి. పూర్తి వివరాలను www.ccrtindia.gov.in వెబ్‌సైట్ నుంచి పొందవచ్చు.

Labels: ,